About

గుజరాత్, మహారాష్ట్రలో భూకంపం

Written By sreenu on Friday, April 13, 2012 | 11:52 PM

ముంబయి: దేశ పశ్చిమ ప్రాంతంలో శనివారం భూకంపం సంభవించింది. దీని ఫలితంగా గుజరాత్‌, మహారాష్ట్రల్లోని పలు ప్రాంతాలలో ఈరోజు ఉదయం 8.54 గంటలకు భూమి కంపించింది. ముంబయి, పుణె, సతారా, కొల్హాపూర్‌, రత్నగిరి, కొంకణ్ ప్రాంత ప్రజలు భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు.
అయితే భూకంపం కారణంగా ఎటువంటి నష్టమూ సంభవించలేదని తెలుస్తోంది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రతను 4 నుంచి 4.9గా గుర్తించారు. గుజరాత్‌లోని రాన్‌ ఆఫ్‌ కచ్‌ కేంద్రంగా భూమి కంపించింది.

0 comments:

Post a Comment